ఐఎస్ఐ అలజడులు.. ఐబి హెచ్చరికలు..ఈ మూడు రాష్ట్రాలను జల్లెడపడుతున్న పోలీసులు

- August 20, 2019 , by Maagulf
ఐఎస్ఐ అలజడులు.. ఐబి హెచ్చరికలు..ఈ మూడు రాష్ట్రాలను జల్లెడపడుతున్న పోలీసులు

ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింత పెంచిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఉగ్రవాదులు రూటు మార్చి రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐబి సమాచారం అందించింది. ఐబి అందించిన సమాచారంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ను ప్రకటించారు. ఈ మూడు రాష్ట్రాలను పోలీసులు జల్లెడపడుతున్నాయి.

దేశంలోకి నాలుగు ఐఎస్ఐ తీవ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందటంతో.. హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని పోలీసులకు కేంద్రం ఆదేశించింది. కీలకమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అనుమానితులను ప్రశ్నించాలని, వాహనాలను తనిఖీ చేయాలని కేంద్రం సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com