జాకీచాన్ మైనపు విగ్రహాన్ని సోనూసూద్ ఆవిష్కరించారు
- April 06, 2016రాజస్థాన్ రాజధాని జైపూర్లో మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, నటుడు అయిన జాకీచాన్ మైనపు విగ్రహాన్ని రూపొందించారు. నహర్గడ్ కోటలో రూపొందించిన ఈ విగ్రహాన్ని నటుడు సోనూసూద్ ఆవిష్కరించారు. ఈ విషయాన్ని సోనూ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఫొటో పోస్ట్ చేశాడు. జాకీ, సోనూసూద్లు ఇండో-చైనీస్ చిత్రమైన 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జోధ్పూర్లో జరుగుతోంది. ఇందులో జాకీకి జంటగా బాలీవుడ్ నటి అమైరా దస్తర్ నటిస్తోంది. స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్కు వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య జరిగిన మూడు చిత్రాల ఒప్పందంలో ఒకటి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్