భారతదేశంలో గురువారం జరుపుకోనున్న ఈద్-ఉల్-ఫితర్
- July 05, 2016
ముస్లింల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు జులై 7 గురువారం రోజున సెలవు దినంగా ప్రకటించారు. తొలుత జులై 6న ఈ సెలవును ప్రకటించగా.. దిల్లీ వ్యాప్తంగా ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలు జరపుకోనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అదే రోజున సెలవు ఇస్తున్నట్లు పర్సనల్ అండ్ ట్రయినింగ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
కాగా.. దిల్లీ మినహా మిగతా ప్రాంతాల్లోని కార్యాలయాలు మాత్రం.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించిన తేదీ ఆధారంగా.. అక్కడి ఉద్యోగుల కమిటీ లేదా కార్యాలయ అధికారులు సెలవు దినాన్ని ప్రకటిస్తారని సదరు డిపార్ట్మెంట్ పేర్కొంది. అయితే స్టాక్ మార్కెట్లు మాత్రం బుధవారం సెలవుదినంగా నిర్ణయించాయి.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







