అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- March 20, 2025
నిజ్వా: అల్ దఖిలియా గవర్నరేట్లోని వారసత్వ, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023లో నమోదైన 312,243 మంది సందర్శకులతో పోలిస్తే 2024లో 415,081 మందికి చేరుకుందని తెలిపింది. అల్ దఖిలియా గవర్నరేట్ దాని భౌగోళిక వైవిధ్యం, వారసత్వ అద్భుతాల కారణంగా ఒమన్లోని అత్యంత ప్రముఖ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతుందని వెల్లడించింది. ఇటీవల చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు కూడా టూరిజానికి తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. హోటల్, అడ్వెంచర్ తదితర ఈవెంట్ల నిర్వాహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు..దాంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని మంత్రిత్వశాఖ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







