అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!

- March 20, 2025 , by Maagulf
అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!

నిజ్వా: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని వారసత్వ, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఒమన్ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023లో నమోదైన 312,243 మంది సందర్శకులతో పోలిస్తే 2024లో 415,081 మందికి చేరుకుందని తెలిపింది. అల్ దఖిలియా గవర్నరేట్ దాని భౌగోళిక వైవిధ్యం, వారసత్వ అద్భుతాల కారణంగా ఒమన్‌లోని అత్యంత ప్రముఖ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతుందని వెల్లడించింది. ఇటీవల చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు కూడా టూరిజానికి తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. హోటల్, అడ్వెంచర్ తదితర ఈవెంట్ల నిర్వాహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు..దాంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని మంత్రిత్వశాఖ గుర్తుచేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com