నకిలీ వస్తువులను అమ్ముతున్న 375 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్ట్..!!
- March 23, 2025
యూఏఈ: రమదాన్ మాసం పురస్కరించుకొని బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాలు, నకిలీ వస్తువులను అక్రమంగా అమ్ముతున్నందుకు 375 మంది వీధి వ్యాపారులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. లైసెన్స్ లేని విక్రేతల నుండి కొనుగోలు చేయవద్దని నివాసితులను ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉత్పత్తులను రవాణా చేయడానికి, విక్రయించడానికి ఉపయోగించే అనేక వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
యాంటీ-స్ట్రీట్ వెండింగ్ విభాగం అధిపతి లెఫ్టినెంట్ కల్నల్ తాలిబ్ అల్ అమిరి మాట్లాడుతూ.. లైసెన్స్ లేని విక్రేతలు లేదా రోడ్డు పక్కన ఉన్న వాహనాల నుండి వస్తువులను.. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. ప్రజలు తమ భద్రత, శ్రేయస్సును నిర్ధారించుకోవడానికి ఆహార కొనుగోళ్ల కోసం లైసెన్స్ పొందిన సంస్థలను మాత్రమే ఆశ్రయించాలని ఆయన కోరారు. ఈ వస్తువులు సరైన నిర్వహణ, నిల్వ లేకపోవడం వల్ల ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమవుతాయని, దీనివల్ల వినియోగదారులు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు గురవుతారని అని దుబాయ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!







