టూరిజం హబ్ గా దమానియాత్ దీవులు.. 96వేలమంది సందర్శన..!!
- March 25, 2025
బర్కా: దమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్ను సందర్శించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023లో 71, 263 మంది సందర్శకులు, 2024లో 96,625 మంది సందర్శకులు సందర్శించారు. దమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్ మొత్తం వైశాల్యం సముద్ర పరిసర ప్రాంతంతో సహా 203 చదరపు కిలోమీటర్లు అని సౌత్ అల్ బటినా గవర్నరేట్లోని పర్యావరణ శాఖ డైరెక్టర్ సలీం సయీద్ అల్ మస్కారి తెలిపారు.
నవంబర్ ప్రారంభం నుండి ఏప్రిల్ చివరి వరకు నైట్ స్టే తోపాటు క్యాంపింగ్ కోసం ఎన్విరాన్మెంట్ అథారిటీ అల్ జబల్ అల్ కబీర్ ద్వీపం, లాజౌన్ ద్వీపాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వివిధ రంగాలలోని పరిశోధకులకు రిజర్వ్ను ఆకర్షణీయంగా మార్చడానికి ఇంటరాక్టివ్ స్క్రీన్లను అమర్చడం ద్వారా రిజర్వ్ కు వచ్చే సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు.
దమానియాత్ దీవులలో 2024లో ప్రారంభించిన అండర్-వాటర్ మిలిటరీ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. ఎన్విరాన్మెంట్ అథారిటీ ఎన్విరాన్మెంట్ అథారిటీ పోర్టల్ ద్వారా దమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్ను సందర్శించడానికి బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!









