టూరిజం హబ్ గా దమానియాత్ దీవులు.. 96వేలమంది సందర్శన..!!
- March 25, 2025
బర్కా: దమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్ను సందర్శించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023లో 71, 263 మంది సందర్శకులు, 2024లో 96,625 మంది సందర్శకులు సందర్శించారు. దమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్ మొత్తం వైశాల్యం సముద్ర పరిసర ప్రాంతంతో సహా 203 చదరపు కిలోమీటర్లు అని సౌత్ అల్ బటినా గవర్నరేట్లోని పర్యావరణ శాఖ డైరెక్టర్ సలీం సయీద్ అల్ మస్కారి తెలిపారు.
నవంబర్ ప్రారంభం నుండి ఏప్రిల్ చివరి వరకు నైట్ స్టే తోపాటు క్యాంపింగ్ కోసం ఎన్విరాన్మెంట్ అథారిటీ అల్ జబల్ అల్ కబీర్ ద్వీపం, లాజౌన్ ద్వీపాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వివిధ రంగాలలోని పరిశోధకులకు రిజర్వ్ను ఆకర్షణీయంగా మార్చడానికి ఇంటరాక్టివ్ స్క్రీన్లను అమర్చడం ద్వారా రిజర్వ్ కు వచ్చే సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు.
దమానియాత్ దీవులలో 2024లో ప్రారంభించిన అండర్-వాటర్ మిలిటరీ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ అని తెలిపారు. ఎన్విరాన్మెంట్ అథారిటీ ఎన్విరాన్మెంట్ అథారిటీ పోర్టల్ ద్వారా దమానియాత్ దీవుల నేచర్ రిజర్వ్ను సందర్శించడానికి బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!