రంజాన్, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా 222 మంది బెగ్గర్స్ అరెస్ట్..!!
- April 05, 2025
యూఏఈ: ఎమిరేట్లో భిక్షాటన సంబంధిత మోసపూరిత కార్యకలాపాలను ఎదుర్కోవడానికి నిరంతర ప్రయత్నంలో భాగంగా దుబాయ్ పోలీసులు.. రమదాన్, ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా 222 మంది బెగ్గర్స్ ను అరెస్టు చేసినట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది.
222 మంది యాచకులలో 33 మందిని ప్రత్యేకంగా ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అరెస్టు చేసినట్లు క్రైమ్స్ వింగ్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ తెలిపారు. పిల్లలతో భిక్షాటన చేస్తున్న పలువురు మహిళలపై కేసులు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు.
దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్లోని “పోలీస్ ఐ” ఫీచర్, 901కి కాల్ చేయడం ద్వారా లేదా www.ecrime.aeలోని E-క్రైమ్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్ బెగ్గింగ్ కేసులను నివేదించడం ద్వారా బెగ్గర్స్ గురించి నివేదించమని ఆయన కమ్యూనిటీ సభ్యులను ప్రోత్సహించారు.
యూఏఈలో భిక్షాటన చేయడం నేరం, దీనికి దిర్హామ్లు 5,000 జరిమానాతోపాటు మూడు నెలల జైలు శిక్ష విధించబడుతుంది. బెగ్గర్స్ ముఠాను నిర్వహిస్తున్నట్లు లేదా భిక్షాటన కోసం దేశం వెలుపల నుండి వ్యక్తులను నియమించినట్లు తేలితే ఆరు నెలల జైలు శిక్షతోపాటు దిర్హామ్లు 1,00,000 జరిమానా విధించబడుతుందని, పర్మిట్ లేకుండా నిధులు సేకరించడం చేస్తే దిర్హామ్లు 5,00,000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









