అమెరికా ఆంక్షలు.. ఆ 7 సంస్థలు 'దేశంలో పనిచేయడం లేదు' : యూఏఈ
- April 05, 2025
యూఏఈ: సుడాన్లో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ యూఏఈ కంపెనీలపై అమెరికా ఆంక్షల విధించింది. అయితే, దీనిపై యూఏఈ స్పందించింది. యూఎస్ ఆంక్షలు విధించిన ఆ ఏడు కంపెనీలు యూఏఈలో చెల్లుబాటు అయ్యే వాణిజ్య లైసెన్సులు లేవని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తమ దేశంలో సదరు కంపెనీలు పనిచేయడం లేదని న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
జనవరి 7న అమెరికా తన సుడాన్ ఆంక్షల కార్యక్రమం కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న ఏడు సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ సంస్థలలో క్యాపిటల్ ట్యాప్ హోల్డింగ్ LLC, క్యాపిటల్ ట్యాప్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీస్ LLC, క్యాపిటల్ ట్యాప్ జనరల్ ట్రేడింగ్ LLC, క్రియేటివ్ పైథాన్ LLC, అల్ జుమోరౌడ్, అల్ యాకూత్ గోల్డ్ & జ్యువెలర్స్ LLC, అల్ జిల్ అల్ ఖాదెమ్ జనరల్ ట్రేడింగ్ LLC, హారిజన్ అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ జనరల్ ట్రేడింగ్ LLC ఉన్నాయి.
ఆంక్షల తర్వాత, యూఏఈ ఈ సంస్థలు వాటి సంబంధిత వ్యక్తులపై తన స్వంత దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులకు మద్దతుగా అమెరికా అధికారుల నుండి అదనపు సమాచారాన్ని కోరింది. ఏడు సంస్థలలో ఏవీ యూఏఈలో యాక్టివ్ వ్యాపార లైసెన్స్ను కలిగి లేవని లేదా అవి ప్రస్తుతం ఎమిరేట్స్ లో పనిచేయడం లేదని న్యాయ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







