అమెరికా ఆంక్షలు.. ఆ 7 సంస్థలు 'దేశంలో పనిచేయడం లేదు' : యూఏఈ
- April 05, 2025
యూఏఈ: సుడాన్లో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ యూఏఈ కంపెనీలపై అమెరికా ఆంక్షల విధించింది. అయితే, దీనిపై యూఏఈ స్పందించింది. యూఎస్ ఆంక్షలు విధించిన ఆ ఏడు కంపెనీలు యూఏఈలో చెల్లుబాటు అయ్యే వాణిజ్య లైసెన్సులు లేవని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తమ దేశంలో సదరు కంపెనీలు పనిచేయడం లేదని న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
జనవరి 7న అమెరికా తన సుడాన్ ఆంక్షల కార్యక్రమం కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న ఏడు సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ సంస్థలలో క్యాపిటల్ ట్యాప్ హోల్డింగ్ LLC, క్యాపిటల్ ట్యాప్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీస్ LLC, క్యాపిటల్ ట్యాప్ జనరల్ ట్రేడింగ్ LLC, క్రియేటివ్ పైథాన్ LLC, అల్ జుమోరౌడ్, అల్ యాకూత్ గోల్డ్ & జ్యువెలర్స్ LLC, అల్ జిల్ అల్ ఖాదెమ్ జనరల్ ట్రేడింగ్ LLC, హారిజన్ అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ జనరల్ ట్రేడింగ్ LLC ఉన్నాయి.
ఆంక్షల తర్వాత, యూఏఈ ఈ సంస్థలు వాటి సంబంధిత వ్యక్తులపై తన స్వంత దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులకు మద్దతుగా అమెరికా అధికారుల నుండి అదనపు సమాచారాన్ని కోరింది. ఏడు సంస్థలలో ఏవీ యూఏఈలో యాక్టివ్ వ్యాపార లైసెన్స్ను కలిగి లేవని లేదా అవి ప్రస్తుతం ఎమిరేట్స్ లో పనిచేయడం లేదని న్యాయ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









