290 మిలియన్ల ఆర్డర్ల డెలివరీలు..45%తో రియాద్ టాప్..!!
- April 07, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని డెలివరీ కంపెనీలు 2024 సంవత్సరంలో అద్భుతమైన వృద్ధిని సాధించాయని, నమోదైన ఆర్డర్ల సంఖ్య 290 మిలియన్లను మించిందని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) వెల్లడించింది. ఈ పెరుగుదల లాజిస్టిక్స్ మార్కెట్ నిరంతర విస్తరణ, వేగవంతమైన, సౌకర్యవంతమైన డెలివరీల కోసం పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం, 61 కంపెనీలు డెలివరీ రంగంలో పనిచేయడానికి TGA ద్వారా లైసెన్స్ పొందాయని తెలిపారు.
రియాద్ ప్రాంతం 130.5 మిలియన్లకు పైగా ఆర్డర్లతో అగ్రస్థానంలో ఉంది. ఇది డెలివరీ కంపెనీలు నిర్వహించే మొత్తం డెలివరీలలో 45.3 శాతం. రియాద్ తర్వాత మక్కా ప్రాంతం 65.4 మిలియన్ ఆర్డర్లతో (22.7 శాతం), తూర్పు ప్రావిన్స్ 43.2 మిలియన్ ఆర్డర్లతో (15 శాతం) తర్వాతి ప్లేసులో ఉన్నాయి. మదీనా ప్రాంతం 12.3 మిలియన్ ఆర్డర్లను (4.3 శాతం) నమోదు చేయగా, అసిర్ ప్రాంతం 9.4 మిలియన్ ఆర్డర్లను (3.2 శాతం) నమోదు చేసింది. అసిర్ తర్వాత ఖాసిమ్ ప్రాంతం 8.5 మిలియన్ ఆర్డర్లతో (2.9 శాతం), తరువాత తబుక్ 5.2 మిలియన్ ఆర్డర్లతో (1.8 శాతం), హెయిల్ 4.1 మిలియన్ ఆర్డర్లతో (1.4 శాతం), జజాన్ 3.3 మిలియన్ ఆర్డర్లతో (1.1 శాతం) ఉన్నాయి.
స్మార్ట్ అప్లికేషన్లు పౌరులు, ప్రవాసుల జీవితాల్లో అంతర్భాగంగా మారాయని, ఈ అప్లికేషన్లపై వినియోగదారులు ఆధారపడటం డిమాండ్ను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అథారిటీ నొక్కి చెప్పింది. రాజ్యంలో 50 కంటే ఎక్కువ లైసెన్స్ పొందిన డెలివరీ కంపెనీలు ఉండటం దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. దాంతోపాటు మారుతున్న వినియోగదారుల ప్రవర్తన, ఇ-కామర్స్పై పెరుగుతున్న ఆధారపడటం డెలివరీ సేవలకు డిమాండ్ను పెంచాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









