ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- April 10, 2025
దోహా, ఖతార్: ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభ ఎడిషన్ అధికారికంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం సంప్రదాయం, ఆవిష్కరణలను అందించనుంది. దాంతోపాటు స్థానిక , ప్రాంతీయ ఫిషింగ్ బ్రాండ్లు, ఇంటరాక్టివ్ అనుభవాలు, ప్రత్యక్ష సముద్ర ప్రదర్శనలు, ఫిషింగ్ పోటీలను ప్రదర్శిస్తుందని ఓల్డ్ దోహా పోర్టు సీఈఓ ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు. ఫిషింగ్ ఎగ్జిబిషన్లో 30 మందికి పైగా ఎగ్జిబిటర్లు , ఫిషింగ్లో ప్రత్యేకత కలిగిన 150 కి పైగా స్థానిక, ప్రాంతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయని తెలిపారు.
ఈ ప్రదర్శన ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఓల్డ్ దోహా ఓడరేవులోని మినా జిల్లాకు దక్షిణంగా ఉన్న మినా పార్క్లో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







