ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- April 10, 2025
దోహా, ఖతార్: ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభ ఎడిషన్ అధికారికంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం సంప్రదాయం, ఆవిష్కరణలను అందించనుంది. దాంతోపాటు స్థానిక , ప్రాంతీయ ఫిషింగ్ బ్రాండ్లు, ఇంటరాక్టివ్ అనుభవాలు, ప్రత్యక్ష సముద్ర ప్రదర్శనలు, ఫిషింగ్ పోటీలను ప్రదర్శిస్తుందని ఓల్డ్ దోహా పోర్టు సీఈఓ ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు. ఫిషింగ్ ఎగ్జిబిషన్లో 30 మందికి పైగా ఎగ్జిబిటర్లు , ఫిషింగ్లో ప్రత్యేకత కలిగిన 150 కి పైగా స్థానిక, ప్రాంతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయని తెలిపారు.
ఈ ప్రదర్శన ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఓల్డ్ దోహా ఓడరేవులోని మినా జిల్లాకు దక్షిణంగా ఉన్న మినా పార్క్లో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







