ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- April 10, 2025
దోహా, ఖతార్: ఓల్డ్ దోహా పోర్టులో ఫిషింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభ ఎడిషన్ అధికారికంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం సంప్రదాయం, ఆవిష్కరణలను అందించనుంది. దాంతోపాటు స్థానిక , ప్రాంతీయ ఫిషింగ్ బ్రాండ్లు, ఇంటరాక్టివ్ అనుభవాలు, ప్రత్యక్ష సముద్ర ప్రదర్శనలు, ఫిషింగ్ పోటీలను ప్రదర్శిస్తుందని ఓల్డ్ దోహా పోర్టు సీఈఓ ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు. ఫిషింగ్ ఎగ్జిబిషన్లో 30 మందికి పైగా ఎగ్జిబిటర్లు , ఫిషింగ్లో ప్రత్యేకత కలిగిన 150 కి పైగా స్థానిక, ప్రాంతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయని తెలిపారు.
ఈ ప్రదర్శన ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. ఓల్డ్ దోహా ఓడరేవులోని మినా జిల్లాకు దక్షిణంగా ఉన్న మినా పార్క్లో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









