సౌదీ, అమెరికా విదేశాంగ మంత్రులు వాషింగ్టన్లో భేటీ..!!
- April 10, 2025
వాషింగ్టన్ : సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మంగళవారం వాషింగ్టన్లోని విదేశాంగ శాఖలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇద్దరు అధికారులు సమీక్షించారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలను చర్చించారు.
గాజా, సూడాన్, యెమెన్ పరిణామాలు, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వివాదంతో సహా పరస్పర ఆందోళన కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమన్వయం, ఉమ్మడి ప్రయత్నాలను తీవ్రతరం చేయడం ప్రాముఖ్యతను ఈ సమావేశంలో చర్చించారు. వీటితోపాటు కీలక అంశాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









