తిరుమల: టీటీడీ తరఫున ఒంటిమిట్ట రామయ్యకు ఖరీదైన కానుక
- April 11, 2025
ఒంటిమిట్ట: శ్రీ రామనవమి ఉత్సవాల వైభవంతో కనువిందు చేస్తున్న ఒంటిమిట్ట కోదండరామస్వామికి ఈరోజు రూ.6 కోట్ల విలువైన మూడు బంగారు కిరీటాల సమర్పణ జరిగింది. ప్రముఖ పెన్నా సిమెంట్ సంస్థ అధినేత పెన్నా ప్రతాప రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసివచ్చి స్వామికి సమర్పించారు.
ఇవాళ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ కిరీటాలను వారు తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావులకు అందచేశారు. ఆలయంలోని మూలమూరతులైన సీతా రామ లక్ష్మణుల కోసం రూ. 6.60 కోట్ల వ్యయంతో విలువైన రాళ్ళను పొదిగించి చేయించిన ఆ మూడు బంగారు కిరీటాల బరువు 7 కిలోగ్రాములని టీ టీ డి ప్రకటించింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మూల మూర్థులకు అలంకరించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









