ఈ-స్కూటర్, సైక్లింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు కొత్త ట్రాఫిక్ యూనిట్..!!
- April 13, 2025
యూఏఈ: దుబాయ్లోని అధికారులు త్వరలో సైక్లిస్టులు, ఈ-స్కూటర్ రైడర్ల ఉల్లంఘనలను పర్యవేక్షించడంపై దృష్టి సారించేందుకు ప్రత్యేక యూనిట్ను ప్రారంభించనున్నారు. కొత్త పర్సనల్ మొబిలిటీ మానిటరింగ్ యూనిట్ సైక్లింగ్, ఈ-స్కూటర్ ట్రాక్లపై ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని, అదే సమయంలో అన్ని సంబంధిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటుందని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) తెలిపింది. దుబాయ్ పోలీసుల సహకారంతో ప్రారంభించబడిన ఈ యూనిట్.. ట్రాఫిక్ నియమాలను పాటించడాన్ని పర్యవేక్షిస్తుంది. సైక్లింగ్ లేన్లపై ట్రాఫిక్ వేగాన్ని పర్యవేక్షిస్తుంది. సురక్షిత రైడింగ్ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా జరిమానాలను విధించనున్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







