ఈ-స్కూటర్, సైక్లింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు కొత్త ట్రాఫిక్ యూనిట్..!!
- April 13, 2025
యూఏఈ: దుబాయ్లోని అధికారులు త్వరలో సైక్లిస్టులు, ఈ-స్కూటర్ రైడర్ల ఉల్లంఘనలను పర్యవేక్షించడంపై దృష్టి సారించేందుకు ప్రత్యేక యూనిట్ను ప్రారంభించనున్నారు. కొత్త పర్సనల్ మొబిలిటీ మానిటరింగ్ యూనిట్ సైక్లింగ్, ఈ-స్కూటర్ ట్రాక్లపై ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని, అదే సమయంలో అన్ని సంబంధిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటుందని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) తెలిపింది. దుబాయ్ పోలీసుల సహకారంతో ప్రారంభించబడిన ఈ యూనిట్.. ట్రాఫిక్ నియమాలను పాటించడాన్ని పర్యవేక్షిస్తుంది. సైక్లింగ్ లేన్లపై ట్రాఫిక్ వేగాన్ని పర్యవేక్షిస్తుంది. సురక్షిత రైడింగ్ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా జరిమానాలను విధించనున్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!