ఈ-స్కూటర్, సైక్లింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు కొత్త ట్రాఫిక్ యూనిట్..!!
- April 13, 2025
యూఏఈ: దుబాయ్లోని అధికారులు త్వరలో సైక్లిస్టులు, ఈ-స్కూటర్ రైడర్ల ఉల్లంఘనలను పర్యవేక్షించడంపై దృష్టి సారించేందుకు ప్రత్యేక యూనిట్ను ప్రారంభించనున్నారు. కొత్త పర్సనల్ మొబిలిటీ మానిటరింగ్ యూనిట్ సైక్లింగ్, ఈ-స్కూటర్ ట్రాక్లపై ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని, అదే సమయంలో అన్ని సంబంధిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటుందని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) తెలిపింది. దుబాయ్ పోలీసుల సహకారంతో ప్రారంభించబడిన ఈ యూనిట్.. ట్రాఫిక్ నియమాలను పాటించడాన్ని పర్యవేక్షిస్తుంది. సైక్లింగ్ లేన్లపై ట్రాఫిక్ వేగాన్ని పర్యవేక్షిస్తుంది. సురక్షిత రైడింగ్ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా జరిమానాలను విధించనున్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







