ఈ-స్కూటర్, సైక్లింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు కొత్త ట్రాఫిక్ యూనిట్..!!
- April 13, 2025
యూఏఈ: దుబాయ్లోని అధికారులు త్వరలో సైక్లిస్టులు, ఈ-స్కూటర్ రైడర్ల ఉల్లంఘనలను పర్యవేక్షించడంపై దృష్టి సారించేందుకు ప్రత్యేక యూనిట్ను ప్రారంభించనున్నారు. కొత్త పర్సనల్ మొబిలిటీ మానిటరింగ్ యూనిట్ సైక్లింగ్, ఈ-స్కూటర్ ట్రాక్లపై ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని, అదే సమయంలో అన్ని సంబంధిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటుందని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) తెలిపింది. దుబాయ్ పోలీసుల సహకారంతో ప్రారంభించబడిన ఈ యూనిట్.. ట్రాఫిక్ నియమాలను పాటించడాన్ని పర్యవేక్షిస్తుంది. సైక్లింగ్ లేన్లపై ట్రాఫిక్ వేగాన్ని పర్యవేక్షిస్తుంది. సురక్షిత రైడింగ్ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా జరిమానాలను విధించనున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







