కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు..!!
- April 17, 2025
దుబాయ్: బుధవారం సాయంత్రం బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్లో గ్రాముకు Dh400 కంటే తక్కువగా ఔన్సుకు $3,300 దాటింది. అమెరికా-చైనా సుంకాల యుద్ధం, బలహీనమైన డాలర్ కారణంగా విలువైన బంగారం ధరలు ఔన్సుకు $3,300 దాటిపోయాయి. దుబాయ్లో 24K గ్రాముకు Dh400 కు కొద్దిగా తక్కువగా ఉంది. ఇతర వేరియంట్లలో 22K, 21K, 18K వరుసగా గ్రాముకు Dh369.5, Dh354.5, Dh303.75 లకు పెరిగాయి. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిరంతర అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందని యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (UNCTAD) హెచ్చరించింది. అమెరికా, చైనా ఇతర దేశాల మధ్య ప్రపంచ సుంకాల యుద్ధం మరింత పెరిగితే, సురక్షితమైన బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయని, దాంతో వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఆర్థిక సంస్థలు ఇటీవల బంగారం ధర అంచనాలను సంవత్సరాంతానికి $3,700, 2026 మధ్య నాటికి $4,000 కు పెరుగుతాయని సాక్సో బ్యాంక్ కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సెన్ విశ్లేషించారు.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







