కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు..!!
- April 17, 2025
దుబాయ్: బుధవారం సాయంత్రం బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్లో గ్రాముకు Dh400 కంటే తక్కువగా ఔన్సుకు $3,300 దాటింది. అమెరికా-చైనా సుంకాల యుద్ధం, బలహీనమైన డాలర్ కారణంగా విలువైన బంగారం ధరలు ఔన్సుకు $3,300 దాటిపోయాయి. దుబాయ్లో 24K గ్రాముకు Dh400 కు కొద్దిగా తక్కువగా ఉంది. ఇతర వేరియంట్లలో 22K, 21K, 18K వరుసగా గ్రాముకు Dh369.5, Dh354.5, Dh303.75 లకు పెరిగాయి. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిరంతర అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందని యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (UNCTAD) హెచ్చరించింది. అమెరికా, చైనా ఇతర దేశాల మధ్య ప్రపంచ సుంకాల యుద్ధం మరింత పెరిగితే, సురక్షితమైన బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయని, దాంతో వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఆర్థిక సంస్థలు ఇటీవల బంగారం ధర అంచనాలను సంవత్సరాంతానికి $3,700, 2026 మధ్య నాటికి $4,000 కు పెరుగుతాయని సాక్సో బ్యాంక్ కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సెన్ విశ్లేషించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









