బహ్రెయిన్-జిసిసి మధ్య కార్మిక సహకారం..!!
- April 18, 2025
మనామా: జిసిసి రాష్ట్రాలలోని కార్మిక, సామాజిక వ్యవహారాల మంత్రుల మండలి ఎగ్జిక్యూటివ్ బ్యూరో డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ బిన్ హసన్ అల్ ఒబైద్లీని బహ్రెయిన్ న్యాయ వ్యవహారాల మంత్రి, తాత్కాలిక కార్మిక మంత్రి యూసిఫ్ బిన్ అబ్దుల్హుస్సేన్ ఖలాఫ్ ఘనంగా స్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య జరిగిన సమావేశంలో పరస్పర సహకారాన్ని పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఉమ్మడి జిసిసి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎగ్జిక్యూటివ్ బ్యూరో తనదైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జిసిసి కార్మిక మార్కెట్లలో వృద్ధిని కొనసాగించడం, నైపుణ్య మార్పిడిని ప్రోత్సహించడం, సభ్య దేశాలలోని ప్రైవేట్ రంగ సంస్థలలో జాతీయ మానవ వనరుల అభివృద్ధి, ఉపాధిలో విజయవంతమైన ప్రయోజనాలను విస్తరించడంపై కూడా ఇరువురు చర్చించారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









