మస్కట్ వేదికగా తదుపరి అమెరికా-ఇరాన్ చర్చలు..!!

- April 20, 2025 , by Maagulf
మస్కట్ వేదికగా తదుపరి అమెరికా-ఇరాన్ చర్చలు..!!

ముస్కట్: ఇరాన్- యునైటెడ్ స్టేట్స్ శనివారం మస్కట్‌లో మరో రౌండ్ చర్చలు జరపడానికి అంగీకరించాయని ఒమన్ తెలిపింది. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది మధ్యవర్తిత్వంలో ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్బాస్ అరఘ్చి, అమెరికా అధ్యక్ష ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ రోమ్‌లో సమావేశం అయ్యారు. తదుపరి దశ చర్చలకు రెండు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

ఇరాన్ పూర్తిగా అణ్వాయుధాలను వదులుకోవాలని అమెరికా, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతోపాటు శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని అభివృద్ధి చేసే హక్కును కాపాడుకోవడం లక్ష్యంగా ఇరాన్ చర్చల్లో పాల్గొంటున్నాయి.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com