ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- April 26, 2025
దోహా, ఖతార్: ఐకానిక్ ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం మే 24న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం ఇస్తుందని ఖతార్ ఫుట్బాల్ అసోసియేషన్ (QFA) ప్రకటించింది. రౌండ్ ఆఫ్ 16 డ్రా సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో QFA పోటీల అధిపతి అలీ హమౌద్ అల్-నుయిమి మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ 53వ ఎడిషన్లో అల్ తుమామా, జాసిమ్ బిన్ , అబ్దుల్లా బిన్ ఖలీఫా స్టేడియంలు కూడా మ్యాచ్లను నిర్వహిస్తాయని తెలపారు. ప్రైమరీ స్టేజీలో ప్రారంభించిన టోర్నమెంట్ ప్రమోషనల్ ప్రచారం పూర్తి స్థాయిలో జరుగుతుందని QFA మీడియా హెడ్ అలీ అల్-సలాత్ అన్నారు. కాగా, మ్యాచ్లు జరిగే సమయంలో అభిమానులకు బహుమతులు అందజేస్తామని, మరిన్ని వివరాలను QFA అధికారిక మీడియా ఛానెల్ల ద్వారా త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







