ప్రవాసాంధ్రుల అభ్యున్నతే ఏపీ ఎన్నార్టీ ధ్యేయం: మంత్రి శ్రీనివాస్
- April 29, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ 14.. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్, అధ్యక్షులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని, ఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో జరిగింది.ప్రధానంగా పరిపాలనా పరమైన అంశాలు, పద్దుల నిర్వహణ, ట్రస్ట్ వ్యవహారాలు, విధానపరమైన నిర్ణయాలు, గత రెండేళ్ళుగా ఎన్నార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చ జరిగింది.అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఐకానిక్ ప్రాజెక్ట్, పురోగతిపై సమీక్షించారు.ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని, ప్రధానంగా ఎన్నారైల అభ్యున్నతి కొరకు కృషి చేయాలని నిర్ణయించారు. ఏపీ ఎన్నార్టీ సభ్యత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రవాసాంధ్రులలో చైతన్యం తీసుకురావాలని, ఎన్నార్టీని విదేశాల్లో ఉన్న ప్రతీ తెలుగు పౌరుడికి చేరువ చేయాలని, సంస్థ నిస్పక్షపక్షపాతంగా సేవలు అందించే దిశగా ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారికి అండగా నిలబడటమే కాకుండా రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబాలకు సైతం ధైర్యం కల్పించే దిశగా సంస్థ ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్నార్టీ సిఈఓ హేమలత, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు వేమూరి రవి కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







