సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ
- April 29, 2025
న్యూ ఢిల్లీ: ఉగ్రవాదం పై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్చ, ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. త్రివిధ దళాధిపతుల సమావేశంలో మోదీ ఈ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు ప్రధాని మోదీ. యాక్షన్ ప్లాన్ లో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదాన్ని అంతమొందించడమే లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ.
మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి భారతదేశం ప్రతిస్పందన, సమయం, లక్ష్యాన్ని నిర్ణయించడానికి భారత సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉందని ఆయన తెలియజేశారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పర్యాటకులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద నెట్వర్క్లే కారణమని భారత్ చెబుతోంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







