దుబాయ్ను అర్బన్, రూరల్ జోన్లుగా విభజన..!!
- May 04, 2025
దుబాయ్: సెక్యూరిటీ, రెస్పాన్స్ టైమ్ ను మెరుగుపరచడం లక్ష్యంగా ఎమిరేట్ను "పట్టణ", "గ్రామీణ" మండలాలుగా విభజించనున్నట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. అథారిటీ అధికారిక X ఖాతా, వారి వెబ్సైట్ ద్వారా ఈ మేరకు ప్రకటించారు. ఈ వ్యూహాత్మక విభాగం గస్తీ, సిబ్బందితో సహా వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేస్తుందని, ప్రతి జోన్లో అత్యాధునిక స్మార్ట్ టెక్నాలజీలు, కృత్రిమ మేధస్సును కలుపుతుందని తెలిపారు.
ఈ విభజన భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర కీలకమైన సేవలలో ప్రత్యేక సిబ్బందిని మరింత సమర్థవంతంగా సమన్వయం చేస్తుందని దుబాయ్ పోలీసులలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారాల అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సౌరి తెలిపారు. ఇది దుబాయ్ పోలీసు కార్యకలాపాల మొత్తం సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందనకు, మొత్తం ఎమిరేట్ అంతటా భద్రతా కవరేజీని మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. జోన్ల విభజన ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా దుబాయ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







