షేక్ సబా అల్ అహ్మద్ నేచురల్ రిజర్వ్లో 'ఏక్ పెడ్ మా కే నామ్'..!!
- May 04, 2025
కువైట్: షేక్ సబా అల్ అహ్మద్ నేచురల్ రిజర్వ్లో ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహ్రా గవర్నర్ హెచ్.ఇ హమద్ జాసిమ్ అల్-హబాషి, కువైట్లోని UN హాబిటాట్ , IOM అధిపతి, అనేక దేశాల రాయబారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ , స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ రాంటెరియం ఎపాపోసమ్, కాలిగోనమ్ కోమోసమ్, అకాసియా గెరార్డి వంటి స్థానిక మొక్కలను నాటారు. వాటిపై వారి తల్లి పేరు ఉన్న ప్లకార్డ్ను ఉంచారు.
2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'తల్లి కోసం మొక్క (ఏక్ పెడ్ మా కే నామ్)' ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ తల్లులకు నివాళిగా చెట్లను నాటాలని కోరారు. ఈ చొరవకు విస్తృత మద్దతు, భాగస్వామ్యం లభించింది. ఇప్పటివరకు 1.4 బిలియన్లకు పైగా మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భారత ప్రధానమంత్రితో కలిసి లేదా విడివిడిగా చెట్లను నాటడం ద్వారా ఈ చొరవలో చేరారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







