మిస్సైల్ అటాక్..టెల్ అవీవ్కు ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ రద్దు..!!
- May 05, 2025
యూఏఈ: ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో యెమెన్ హౌతీలు క్షిపణి దాడి చేసిన తర్వాత టెల్ అవీవ్కు తమ విమానం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నట్లు యూఏఈ క్యారియర్ ఫ్లైదుబాయ్ తెలిపింది. అయితే, దాడి తర్వాత ఇజ్రాయెల్కు తమ విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి తర్వాత ఢిల్లీ నుండి టెల్ అవీవ్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI139 అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది.
క్షిపణి టెర్మినల్ 3 పార్కింగ్ స్థలానికి సమీపంలో ఉన్న రహదారిపై పడిందని, దీనివల్ల ఒక గుంత ఏర్పడిందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రయాణంలో ఉన్న విమానం, భద్రతా కారణాల దృష్ట్యా జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత తిరిగి వచ్చి అబుదాబిలో సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపారు.
మరోవైపు "భద్రతా" సమస్యల కారణంగా ఎయిర్ ఇండియా మే 6 వరకు టెల్ అవీవ్కు తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మే 4 , 6 మధ్య చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో బుక్ చేసుకున్న కస్టమర్లకు రీషెడ్యూలింగ్పై ఒకేసారి మినహాయింపు లేదా రద్దు కోసం పూర్తి రీఫండ్ అందించబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







