టైర్లు పేలతాయ్: వాహనదారులకు హెచ్చరిక
- July 09, 2016
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాహనదారులకు టైర్ల రూపంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల్లోనే సల్వా రోడ్పై వరుసగా రెండు ప్రమాదాలు టైర్లు పేలడంతో సంభవించాయి. ఖతార్లో నిబంధనల ప్రకారం రెండేళ్ళ కాలానికి టైర్ల లైఫ్ ముగుస్తుంది. లైఫ్ ముగిసిన తర్వాత కేవలం ఒక్క సంవత్సరానికి మాత్రమే ఉపయోగించడానికి వీలుంటుంది. సేఫ్టీ విషయంలో వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్త పాటించడానికి వీల్లేదు. తక్కువ ఖరీదు టైర్లు 200 ఖతారీ రియాల్స్లో దొరుకుతాయి. అదే మంచి టైర్ కొనాలంటే మాత్రం 400 ఖతారీ రియాల్స్ వెచ్చించాల్సిందే. ప్రాణాలతో పోల్చితే ఈ ఖర్చు ఎక్కువేమీ కాదు. ఎండ వేడిమికి టైర్లలోని పీడనం పెరిగి, టైర్లు పేలిపోయేందుకు అవకాశాలెక్కువ. అందుకే వాహనాన్ని బయటకు తీసేటప్పుడు విధిగా టైర్లను పరిశీలించాలి, అందులో ఎయిర్ కండిషన్ని చూసుకోవాలి. కార్లు వంటి వాహనాలే కాకుండా ద్విచక్ర వాహనాలూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







