సబా అల్-అహ్మద్లో నలుగురు ప్రవాసులు అరెస్ట్..!!
- May 09, 2025
కువైట్: సబా అల్-అహ్మద్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ప్రవాసులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్దసంఖ్యలో విద్యుత్ కేబుల్స్, పరికరాలు, ట్రాన్స్ఫార్మర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా గస్తీ బృందం ప్రవాసులు వెళుతున్న లారీని ఆపి, తనికీలు చేయగా విషయం బయటపడింది. దొంగిలించబడిన వస్తువులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు క్యాబిన్లో దాక్కున్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ సందర్భంగా, అనుమానితులు చోరీ చేసినట్లు అంగీకరించారు. మరిన్ని ఆధారాలను సేకరించడానికి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









