దుబాయ్ లో బ్యాంకింగ్ స్కామ్.. ముడు ముఠాలు.. 13 మంది అరెస్ట్..!!
- May 09, 2025
యూఏఈ: బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్న 13 మంది ఆసియన్లతో కూడిన మూడు క్రిమినల్ ముఠాలను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితులను లక్ష్యంగా చేసుకోవడానికి నేరస్థులు ఫోన్ స్కామ్లను ఉపయోగిస్తున్నారని అధికారులు ప్రకటించారు. “ముఠా సభ్యులు పోలీసులు, బ్యాంకుల వంటి ఏజెన్సీల అధికారుల పేరిట, బ్యాంకింగ్ సమాచారం అప్డేట్, ట్రాఫిక్ జరిమానాలు చెల్లించడం లేదా నివాస సమస్యలను పరిష్కరించడం అనే నెపంతో పౌరులు, నివాసితులను సంప్రదిస్తారు. వివరాలు తెలుసుకొని వారి ఖతాలను ఖాళీ చేస్తారు. ” అని దుబాయ్ పోలీసులు తెలిపారు.
“మూడు అంకెల CVV, వన్-టైమ్ పాస్వర్డ్లు (OTP) వంటి వారి బ్యాంక్ కార్డులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకునేలా బాధితులను ఏమార్చుతారు. ఇందు కోసం ముఠాలు అధునాతన వ్యూహాలను ఉపయోగించాయి. అధికారిక సంస్థలపై ప్రజల నమ్మకాన్ని వారు ఉపయోగించుకున్నారు.” అని అధికారులు తెలిపారు.
అరెస్టు చేసిన స్కామర్ల అస్పష్టమైన ఫోటోలను, వారు ఉపయోగించిన గాడ్జెట్ల ఫోటోలను అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్యాంకులు తమ ఖాతాలను అప్డేట్ చేస్తామని చెప్పుకునే టెక్స్ట్ సందేశాలు, ఇమెయిల్లు లేదా ఫోన్ కాల్ల ద్వారా తమ బ్యాంకింగ్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవాలని ఎప్పుడూ కస్టమర్లను అభ్యర్థించవని దుబాయ్ పోలీసులు ప్రజలకు గుర్తు చేశారు.
ఏదైనా అనుమానాస్పద కమ్యూనికేషన్లను సమీపంలోని పోలీస్ స్టేషన్ను సందర్శించడం ద్వారా లేదా www.ecrime.ae వెబ్సైట్ ద్వారా లేదా దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా "eCrime" ప్లాట్ఫామ్ ద్వారా వెంటనే అధికారులకు నివేదించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









