మానవ అక్రమ రవాణా కేసు..ముగ్గురు ఈజిప్షియన్స్ కు జైలుశిక్షలు..!!
- May 10, 2025
మస్కట్: మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు వంటి నేరాలకు సంబంధించి సోహార్ అప్పీల్ కోర్టు ముగ్గురు ఈజిప్షియన్ పౌరులకు, ఒక వ్యాపారునికి జైలు శిక్షలు, జరిమానాలు విధించారు.శిక్షలు అనంతరం వారిపై బహిష్కరించాలని ఉత్తర్వులను జారీ చేసింది. నిందితులు మొహమ్మద్ నబిల్ ఎల్-సయీద్, షోరూక్ అహ్మద్ మొహమ్మద్, కరీమా మొహమ్మద్ సాద్.. ఎష్రాకత్ అల్-అస్ర్ ట్రేడింగ్ కంపెనీతో పాటు, మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారు. కోర్టు ముగ్గురు వ్యక్తులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 10,000 OMR జరిమానా విధించగా, కంపెనీకి OMR 10,000 జరిమానా విధించింది.
దాంతోపాటు, మానవ అక్రమ రవాణాకు వీలుగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు ముగ్గురు వ్యక్తులను దోషులుగా నిర్ధారించిన కోర్టు, వారికి పదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి OMR 20,000 జరిమానా విధించింది. మొదటి నిందితుడు, కంపెనీ కూడా మనీలాండరింగ్ కేసులో దోషులుగా నిర్ధారించారు. మొదటి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, OMR 50,000 జరిమానా విధించారు. అందులో OMR 10,000 చెల్లించాలి. అయితే కంపెనీకి OMR 100,000 జరిమానా విధించారు. OMR 10,000 చెల్లించాలి.
మొదటి, రెండవ నిందితులు స్పష్టమైన కంటెంట్ను పంపిణీ చేయడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు దోషులుగా నిర్ధారించారు. ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి OMR 500 జరిమానా విధించారు. మూడవ నిందితురాలు తన నివాసాన్ని పునరుద్ధరించడంలో విఫలమైనందుకు, ఆమె వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ నివసించినందుకు దోషిగా తేలింది. ఫలితంగా ప్రతి నేరానికి OMR 100 జరిమానా విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత వారిని శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని, కేసుకు సంబంధించిన నిధులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యాపార లైసెన్స్లను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







