మానవ అక్రమ రవాణా కేసు..ముగ్గురు ఈజిప్షియన్స్ కు జైలుశిక్షలు..!!
- May 10, 2025
మస్కట్: మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు వంటి నేరాలకు సంబంధించి సోహార్ అప్పీల్ కోర్టు ముగ్గురు ఈజిప్షియన్ పౌరులకు, ఒక వ్యాపారునికి జైలు శిక్షలు, జరిమానాలు విధించారు.శిక్షలు అనంతరం వారిపై బహిష్కరించాలని ఉత్తర్వులను జారీ చేసింది. నిందితులు మొహమ్మద్ నబిల్ ఎల్-సయీద్, షోరూక్ అహ్మద్ మొహమ్మద్, కరీమా మొహమ్మద్ సాద్.. ఎష్రాకత్ అల్-అస్ర్ ట్రేడింగ్ కంపెనీతో పాటు, మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారు. కోర్టు ముగ్గురు వ్యక్తులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 10,000 OMR జరిమానా విధించగా, కంపెనీకి OMR 10,000 జరిమానా విధించింది.
దాంతోపాటు, మానవ అక్రమ రవాణాకు వీలుగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు ముగ్గురు వ్యక్తులను దోషులుగా నిర్ధారించిన కోర్టు, వారికి పదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి OMR 20,000 జరిమానా విధించింది. మొదటి నిందితుడు, కంపెనీ కూడా మనీలాండరింగ్ కేసులో దోషులుగా నిర్ధారించారు. మొదటి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, OMR 50,000 జరిమానా విధించారు. అందులో OMR 10,000 చెల్లించాలి. అయితే కంపెనీకి OMR 100,000 జరిమానా విధించారు. OMR 10,000 చెల్లించాలి.
మొదటి, రెండవ నిందితులు స్పష్టమైన కంటెంట్ను పంపిణీ చేయడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకు దోషులుగా నిర్ధారించారు. ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి OMR 500 జరిమానా విధించారు. మూడవ నిందితురాలు తన నివాసాన్ని పునరుద్ధరించడంలో విఫలమైనందుకు, ఆమె వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ నివసించినందుకు దోషిగా తేలింది. ఫలితంగా ప్రతి నేరానికి OMR 100 జరిమానా విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత వారిని శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని, కేసుకు సంబంధించిన నిధులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యాపార లైసెన్స్లను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









