'విశ్వంభర' ఎక్స్క్లూజివ్ ఎపిక్ బుక్ను కాన్స్లో లాంచ్ చేసిన నిర్మాత విక్రమ్ రెడ్డి
- May 22, 2025
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర' ఇప్పటికే నేషనల్ లెవల్ లో మంచి హైప్ను క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ఇతర ప్రమోషనల్ మేటీరియల్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్, వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
మెగా మాస్ ఇప్పుడు సరిహద్దులు దాటి గ్లోబల్గా మారింది. నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంభరను అంతర్జాతీయ వేదిక అయిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు తీసుకెళ్లారు. అక్కడ విశ్వంభర ఎక్స్క్లూజివ్ బుక్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు గురించి వివరించారు. అలాగే సినిమా స్థాయి, VFX స్టూడియోల సహకారం గురించి కూడా చెప్పారు.
టాప్ హాలీవుడ్ VFX స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్, VFX పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయి. మిగతా పనులు వేగంగా సాగుతున్నాయి.
పనులు పూర్తయ్యాక, మేకర్స్ సినిమా విడుదల తేదీని భారీ ప్రమోషన్లతో ప్రకటించనున్నారు. అయితే #WhatIsInsideVishwambharaBook? అనేది ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న.
ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కునాల్ కపూర్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, పాటలు అద్భుతంగా వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. విజువల్ స్టోరీటెల్లింగ్ను ఛోటా కె.నాయుడు మ్యాసీవ్ గా ప్రజెంట్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డిఓపి: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









