ఒమన్ పర్యటనకు చేరుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
- May 26, 2025
మస్కట్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉపప్రధానమంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ అధికారిక పర్యటనలో భాగంగా ఒమన్ చేరుకున్నారు. ఆయనతోపాటు ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కూడా ఈ పర్యటనలో భాగమైంది.
ఈ పర్యటనలో షేక్ హందాన్, ఒమన్ సుల్తాన్ మరియు ప్రధానమంత్రి హైథమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకార మార్గాలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.
విమానాశ్రయంలో షేక్ హందాన్ కు ఒమన్ సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి సయీద్ తయ్యజిన్ బిన్ హైథమ్ తారిఖ్ అల్ సయీద్ స్వాగతం పలికారు.
ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా మైలురాయిగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







