ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేతులు కలిపిన కువైట్, భారత్..!!
- May 27, 2025
కువైట్: భారత ఎంపీ బైజయంత్ జే పాండా నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం సోమవారం కువైట్ ఉప ప్రధానమంత్రి, క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి షెరిడా అబ్దుల్లా సాద్ అల్-మౌషర్జీని కలిసి, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం తీసుకున్న ఇటీవలి చర్యల గురించి ఆయనకు వివరించింది. ఉగ్రవాదం పట్ల తమ జీరో-టాలరెన్స్ విధానాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. "భారతదేశం , కువైట్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా ఉమ్మడి నిబద్ధతలో ఐక్యంగా ఉన్నాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం తీసుకున్న ఇటీవలి చర్యల గురించి వివరించడానికి, మా ఉమ్మడి జీరో-టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించడానికి మా అఖిలపక్ష ప్రతినిధి బృందం.. కువైట్ ఉప ప్రధాన మంత్రి , క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీమతి షెరిడా అబ్దుల్లా సాద్ అల్ మౌషర్జీతో సమావేశం అయింది." అని పాండా Xలో పోస్ట్ లో వివరించారు.
బైజయంత్ జే పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో బిజెపి ఎంపి నిషికాంత్ దుబే, బిజెపి ఎంపి ఫంగ్నోన్ కోన్యాక్, బిజెపి ఎంపి రేఖ శర్మ, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, బిజెపి ఎంపి సత్నామ్ సింగ్ సంధు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, మాజీ భారత దౌత్యవేత్త హర్ష్ ష్రింగ్లా ఉన్నారు.
అనంతరం ప్రతినిధి బృందం కువైట్లోని అతిపెద్ద మసీదు అయిన కువైట్లోని ఐకానిక్ గ్రాండ్ మసీదును సందర్శించింది. భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ బృందం పుష్పగుచ్ఛాలు పెట్టి నివాళులు అర్పించింది.
తాజా వార్తలు
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!







