భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- August 14, 2026
న్యూఢిల్లీ: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘భారత్ కో జానియే’ (Know India) క్విజ్ లో పాల్గొనేందుకు గడువు నేటితో ముగియనుంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ యువత, ఎన్నారైలు (NRIలు), భారత సంతతి వ్యక్తులు (PIOలు), అలాగే విదేశీ పౌరుల కోసం ఈ క్విజ్ను నిర్వహిస్తున్నారు. భారతదేశ చరిత్ర, వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, దేశ ప్రగతి, విజయాలకు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి.
భారత్ గొప్ప వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకునేలా ఈ ప్రత్యేక ఎడిషన్ను రూపొందించారు. విదేశాల్లో ఉన్న భారతీయ యువతతో పాటు భారతదేశంపై ఆసక్తి ఉన్న విదేశీయులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి క్విజ్లో పాల్గొనాల్సి ఉంటుంది.
క్విజ్ వెబ్సైట్: భారత్ కో జానియే క్విజ్ (https://bkjquiz.com )
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







