ఫ్రిడ్జ్ కంటే మట్టి కుండే మేలు
- July 11, 2016
కుమ్మరి కుండను పేదవాడి ఫ్రిడ్జ్ గా పేర్కొంటారు. మట్టికుండలోని నీళ్లతో ఆరోగ్యానికి మేలే కాక పర్యావరణానికీ వెలకట్టలేని మంచి జరుగుతుంది. ఫ్రిడ్జ్ నుంచి ఉత్పత్తయ్యే హానికారక వాయువులు సరాసరి ఓజోన్ పొరపైనే ప్రభావం చూపుతున్నాయి. ఇక వీటి వాడకం వల్ల విద్యుత్ బిల్లు భారీగానే ఉంటోంది. వీటన్నింటికీ మట్టి కుండతో చెక్ పెట్టొచ్చని చెప్తున్నారు కుమ్మరులు.
మట్టి కుండల వాడకాన్ని విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చొరవచూపాలన్నది కుమ్మరి కులస్తుల విజ్ఞప్తి. ఎలక్ట్రానిక్ ఫ్రిడ్జ్ ల వల్ల వచ్చే దుష్ప్రభావాలు, అదనపు ఖర్చును అరికట్టేందుకు, విద్యుత్ పొదుపుకు తగిన చర్యలు తీసుకోవాలని వారంటున్నారు. దీనికి ప్రచారంగా ప్రభుత్వా కార్యాలయాల్లో తాగునీటి కోసం మట్టి కుండలను ఏర్పాటుచేయాలని చెప్తున్నారు. ఇలా చేయడం ద్వారా పర్యావరణానికి మేలుచేయడంతో పాటూ తమకూ ఉపాధి కల్పించినట్టవుతుందని కుమ్మరులు అంటున్నారు. ఫ్రిడ్జ్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు పేలడంతో అనారోగ్య సమస్యలూ కొనితెచ్చుకున్నట్టవుతుందని నిపుణులు చెప్తున్నారు. కరెంట్ బిల్ సంగతి పక్కనపెడితే ఫ్రిడ్జ్ వాటర్ తో గొంతు సంబంధిత వ్యాధులు, అలర్జీ, సైనస్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. కుండలోని నీటితో ఇలాంటి సమస్యలుండవన్నది నిపుణుల మాట. మట్టి కుండలోని నీటితో శరీరానికి సమతూకమైన చల్లదనం అందుతుంది. చెమటద్వారా కోల్పోయిన లవణాలను ఈ నీటి ద్వారా లభిస్తాయి. కిడ్ని, మెదడు చురుగ్గా పనిచేస్తాయి. మరి ఇంకెందుకాలస్యం. ఈ వేసవిలో మీరూ మట్టి కుండ నీరు ట్రై చేయండి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









