ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నా మోడీ
- July 11, 2016
నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. దక్షిణాఫ్రికా, టాంజానియా, మొజాంబిక్, కెన్యా దేశాలలో పర్యటించిన మోడీ పలు అంశాలపై చర్చించి ఒప్పందాలు చేసుకున్నారు. ఇక జమ్ముకశ్మీర్ పరిస్థితిపై మోడీ మంగళవారం సమీక్ష నిర్వహిస్తారు. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్వనీ కాల్చివేత దరిమిలా కశ్మీర్ లోయలో తలెత్తిన హింసాత్మక నిరసనలపై అధికారులు ఆయనకు వివరిస్తారు. కశ్మీర్ పరిస్థితి దృష్ట్యా తనవెంట ఆఫ్రికా పర్యటనలో పాల్గొంటున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను మధ్యలోనే వెనుకకు పంపించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







