ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నా మోడీ

- July 11, 2016 , by Maagulf
ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని  ఢిల్లీకి చేరుకున్నా మోడీ

నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. దక్షిణాఫ్రికా, టాంజానియా, మొజాంబిక్, కెన్యా దేశాలలో పర్యటించిన మోడీ పలు అంశాలపై చర్చించి ఒప్పందాలు చేసుకున్నారు. ఇక జమ్ముకశ్మీర్ పరిస్థితిపై మోడీ మంగళవారం సమీక్ష నిర్వహిస్తారు. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్‌వనీ కాల్చివేత దరిమిలా కశ్మీర్ లోయలో తలెత్తిన హింసాత్మక నిరసనలపై అధికారులు ఆయనకు వివరిస్తారు. కశ్మీర్ పరిస్థితి దృష్ట్యా తనవెంట ఆఫ్రికా పర్యటనలో పాల్గొంటున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను మధ్యలోనే వెనుకకు పంపించిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com