హెరిటేజ్ ఫుడ్స్ 34 ఏళ్ల ప్రస్థానంపై నారా బ్రాహ్మణి సంతోషం
- June 05, 2025
హెరిటేజ్ ఫుడ్స్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ వ్యవస్థాపకుడు నారా చంద్రబాబు దార్శనికతను ప్రశంసించారు.లోకేశ్ మాట్లాడుతూ, హెరిటేజ్ ఫుడ్స్ నాకు గర్వకారణం. ఈ సంస్థ రైతుల ఆర్థిక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించడంలోనూ నిరంతరం ముందుండుతోంది, అన్నారు.ఈ వేడుకలో పాత స్నేహితులను, సహచరులను కలవడం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని లోకేశ్ తెలిపారు. సంస్థకు ఉన్న బలమైన విలువలు, నాయకత్వం తనను ఎంతో ఉత్తేజితం చేశాయని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోకేశ్ మొక్కను నాటారు. ఈ సంస్థ రైతులకు, వినియోగదారులకు మధ్య నమ్మకపు బంధాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.ఈ వేడుకల్లో నారా బ్రాహ్మణి కూడా మాట్లాడారు. 1992లో మా మామ పెట్టిన ఈ బీజం, ఇప్పుడు కోట్లాది మందికి నాణ్యతను అందిస్తున్న సంస్థగా ఎదిగింది. రైతులకు భరోసా, వినియోగదారులకు నమ్మకం అనే రెండు లక్ష్యాలతో మేము ముందుకు సాగుతున్నాం, అన్నారు.
రూ.4,000 కోట్ల ఆదాయ మైలురాయి
2025లో సంస్థ రూ.4,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించడం పట్ల ఆమె గర్వం వ్యక్తం చేశారు. ఇది మా 3,300 మంది ఉద్యోగుల శ్రమ ఫలితం, అంటూ అభినందనలు తెలిపారు.హెరిటేజ్ విజయయాత్రలో భాగస్వాములైన ప్రతి ఉద్యోగికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేశ్ ఉత్సాహపూరిత సందేశం సంస్థకు కొత్త శక్తిని ఇచ్చిందని చెప్పారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







