తిరుపతి వాసులకు సీప్లేన్ టూర్..
- June 09, 2025
తిరుపతి: తిరుపతిలో కూడా సీప్లేన్ పర్యాటకం అభివృద్ధిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఇందుకు అనుగుణంగా తిరుపతి వాసులకు, తిరుమలకు వచ్చే యాత్రికులకు కొత్త అను భూతిని అందించేందుకు ఆలోచన వేస్తోందని సమాచారం, ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మరింత అభివృద్ధి దిశగా వేస్తున్న అడుగుల్లో తిరుపతిలో సీప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటకరంగం అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, హోటళ్ళు విస్తరణకు పూర్తి అవకాశం ఉంటుందనేది ఆలోచన, ఈ సీప్లేన్ ప్రాజెక్టు ప్రారంభమైతే తిరుపతికి మరింత ప్రచారం లభిస్తుంది. జలాశయాలమీద ల్యాండింగ్ టేకాఫ్ వీలుగా ఇప్పటికే రాష్ట్రంలో శ్రీశైలం-విజయవాడ మధ్య సీప్లేన్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
శేషాచలం- తిరుపతి – భాకరాపేట అడవుల మధ్యలో.. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ 3. పథకం ద్వారా సీప్లేన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తిరుపతి- చంద్రగిరి సమీపంలోని కల్యాణి డ్యామ్ లో సీప్లేన్ అభివృద్ధిచేయనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి వాసులకేగాక ఇక్కడకు వచ్చే యాత్రికులకు కూడా ఈ ఆనందం సాకారం కానుందనేది పర్యాటక వర్గాల సమాచారం ఈ సేవలకు పర్యావరణ అను చట్టం స్థిరంగా మతులు, భద్రతా ప్రమాణాలు, నీటిమట్టం స్థిరంగా ఉండే పరిస్థితులు, ఇతర మౌళిక సదుపాయాలను గమనించనున్నారు. శేషాచలం అటవీప్రాంతంలోని తిరుపతి – భాకరాపేట అడవుల మధ్యలో కల్యాణి డ్యామ్ లో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డ్యామ్ ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఉంది.ఈ ప్రాంతం అల విమానాశ్రయంగా మారితే భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది..తిరుపతి నగరజనాభా ఐదారులక్షలమందికి పైగానే ఉంది. రోజువారీగా 80వేల మంది వరకు యాత్రికులు అక్కడకు వస్తున్నారు.ఇక తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం రేణిగుంట, బాకరాపేట, పీలేరు, మదనపల్లి, చిత్తూరు తదితర ప్రాంతాల నుండి జనం ఈ సీప్లేన్ ప్రయా డానికి సుముఖత చూపే అవకాశం ఉంది.2026 మార్చిలోపు ఈ సేవలు అందు బాటులోకి రావచ్చనేది సమాచారం, మరీ ఈ ప్రాజెక్టు ఏర్పాటు కు పలు సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







