ఐదోబ్లాకు సకల హంగులతో సిద్ధమవుతోంది..
- July 12, 2016
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఐదోబ్లాకు సకల హంగులతో సిద్ధమవుతోంది. మెట్లకు ఫినిషింగ్, లిఫ్టుల ఏర్పాటు, భవనానికి బయటి వైపు పెయింటింగ్స్ తప్ప.. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇంటీరియల్ డెకరేషన పనులను కూలీలు రేయింబవుళ్లు షిఫ్టుల పద్ధతిలో చేస్తున్నారు. ఐదో బ్లాకు ప్రవేశ ద్వారానికి గ్లాసు డోర్లు అమర్చారు. కింది ఫ్లోర్లో ఎలక్ర్టికల్, నెట్, ఫైరు పనులు పూర్తయ్యాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, కార్మిక, వైద్యఆరోగ్య శాఖలకు ఉద్యోగుల ఫర్నిచర్, మంత్రులు, కార్యదర్శుల చాంబర్లనూ సిద్ధం చేసేశారు. రవాణాశాఖ మంత్రి ఈనెల 21న తన చాంబర్ను ప్రారంభించనున్నట్లు సమాచారం. తాత్కాలిక సచివాలయ భవనాలను మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ మంగళవారం మంత్రి నారాయణతో కలసి మంగళవారం పరిశీలించారు. నిర్మాణ విశేషాలను మంత్రి శ్రీనివాస్కి వివరించారు. మంత్రుల చాంబర్లను రాయపాటి పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మంగళవారం తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల చాంబర్లను ఆయన పరిశీలించారు. మంత్రి నారాయణతో కొద్దిసేపు చర్చించారు. ఈ నెల 21న రెండు శాఖల కార్యాలయాలు ప్రారంభమవుతాయన్నారు. ఇక్కడకు వచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









