అహ్మదాబాద్లో కూలిన విమానం..
- June 12, 2025
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం కూలిన వెంటనే దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో అలముకున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.ఏడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.గాయపడిన వారిని రెస్క్యూ టీమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రమాదంపై గుజరాత్ సీఎంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదం తీవ్రతకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. మధ్యాహ్నం 1.39గంటల సమయంలో చెట్టును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీ ఉండటంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమాన కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్









