భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్..!!

- June 13, 2025 , by Maagulf
భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్..!!

మస్కట్: అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపారు.ఈ వినాశకరమైన ప్రమాదంపై సుల్తాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన తన హృదయపూర్వక సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. రన్ వే పైనుంచి టేక్ ఆఫ్ అయిన 30 సెకన్లలోనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొట్టి పేలిపోయింది.ఈ ప్రమాదంలో 240కిపైగా ప్రయాణికులు మరణించారు. మృతులలో పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com