భారత రాష్ట్రపతికి సంతాపం తెలిపిన సుల్తాన్..!!
- June 13, 2025
మస్కట్: అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సంతాప సందేశం పంపారు.ఈ వినాశకరమైన ప్రమాదంపై సుల్తాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన తన హృదయపూర్వక సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. రన్ వే పైనుంచి టేక్ ఆఫ్ అయిన 30 సెకన్లలోనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొట్టి పేలిపోయింది.ఈ ప్రమాదంలో 240కిపైగా ప్రయాణికులు మరణించారు. మృతులలో పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్