భారీగా నార్కొటిక్ పిల్స్ రవాణా..అడ్డుకున్న సౌదీ అధికారులు..!!
- June 13, 2025
అల్-వాడియా: సనా నుండి సౌదీ అరేబియాకు తరలిస్తున్న భారీ నార్కొటిక్ పిల్స్ ను అడ్డుకున్నట్లు యెమెన్ సరిహద్దు అధికారులు ప్రకటించారు. సౌదీ-యెమెన్ సరిహద్దు క్రాసింగ్ వద్ద రిఫ్రిజిరేటెడ్ ట్రక్కు పైకప్పు లోపల దాచిన 1.5 మిలియన్లకు పైగా పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అల్-వాడియా బోర్డర్ క్రాసింగ్లోని బోర్డర్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ బెటాలియన్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఒమైర్ అల్-అజాబ్ మాట్లాడుతూ.. రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులో ఈ పిల్స్ ను దాచి ఉంచినట్లు గుర్తించారు. "పిల్స్ రవాణా యెమెన్ రాజధాని సనాలోని మాదకద్రవ్యాల డీలర్లకు చెందినదని గుర్తించాం. వాటిని సౌదీ అరేబియాలోని షరూరా నగరానికి డెలివరీ చేస్తున్నారు. స్వాధీనం చేసుకుని, వాహన డ్రైవర్ పై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమర్థ అధికారులకు అప్పగించారు." అని బ్రిగేడియర్ జనరల్ అల్-అజాబ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







