భారీగా నార్కొటిక్ పిల్స్ రవాణా..అడ్డుకున్న సౌదీ అధికారులు..!!
- June 13, 2025
అల్-వాడియా: సనా నుండి సౌదీ అరేబియాకు తరలిస్తున్న భారీ నార్కొటిక్ పిల్స్ ను అడ్డుకున్నట్లు యెమెన్ సరిహద్దు అధికారులు ప్రకటించారు. సౌదీ-యెమెన్ సరిహద్దు క్రాసింగ్ వద్ద రిఫ్రిజిరేటెడ్ ట్రక్కు పైకప్పు లోపల దాచిన 1.5 మిలియన్లకు పైగా పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అల్-వాడియా బోర్డర్ క్రాసింగ్లోని బోర్డర్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ బెటాలియన్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఒమైర్ అల్-అజాబ్ మాట్లాడుతూ.. రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులో ఈ పిల్స్ ను దాచి ఉంచినట్లు గుర్తించారు. "పిల్స్ రవాణా యెమెన్ రాజధాని సనాలోని మాదకద్రవ్యాల డీలర్లకు చెందినదని గుర్తించాం. వాటిని సౌదీ అరేబియాలోని షరూరా నగరానికి డెలివరీ చేస్తున్నారు. స్వాధీనం చేసుకుని, వాహన డ్రైవర్ పై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమర్థ అధికారులకు అప్పగించారు." అని బ్రిగేడియర్ జనరల్ అల్-అజాబ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







