భారతదేశానికి సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!
- June 13, 2025
మనామా: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమానం ప్రమాదంపై బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సంతాపం తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టెలిగ్రామ్ పంపారు. ప్రమాదంలో మరణించిన వారి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారుజ ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు.. భారతదేశ స్నేహపూర్వక ప్రజలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇద్దరికీ తన సంతాపాన్ని తెలియజేశారు. అధికారిక టెలిగ్రామ్ తోపాటు ఫోన్ కాల్ చేసి మాట్లాడారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జీసీసీ దేశాలకు పలువురు ప్రమాదంపై దింగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







