భారతదేశానికి సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!
- June 13, 2025
మనామా: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమానం ప్రమాదంపై బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సంతాపం తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టెలిగ్రామ్ పంపారు. ప్రమాదంలో మరణించిన వారి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారుజ ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు.. భారతదేశ స్నేహపూర్వక ప్రజలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇద్దరికీ తన సంతాపాన్ని తెలియజేశారు. అధికారిక టెలిగ్రామ్ తోపాటు ఫోన్ కాల్ చేసి మాట్లాడారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జీసీసీ దేశాలకు పలువురు ప్రమాదంపై దింగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్