భారతదేశానికి సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!
- June 13, 2025
మనామా: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమానం ప్రమాదంపై బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సంతాపం తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టెలిగ్రామ్ పంపారు. ప్రమాదంలో మరణించిన వారి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారుజ ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు.. భారతదేశ స్నేహపూర్వక ప్రజలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇద్దరికీ తన సంతాపాన్ని తెలియజేశారు. అధికారిక టెలిగ్రామ్ తోపాటు ఫోన్ కాల్ చేసి మాట్లాడారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జీసీసీ దేశాలకు పలువురు ప్రమాదంపై దింగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







