భారతదేశానికి సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!
- June 13, 2025
మనామా: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమానం ప్రమాదంపై బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సంతాపం తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టెలిగ్రామ్ పంపారు. ప్రమాదంలో మరణించిన వారి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారుజ ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు.. భారతదేశ స్నేహపూర్వక ప్రజలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇద్దరికీ తన సంతాపాన్ని తెలియజేశారు. అధికారిక టెలిగ్రామ్ తోపాటు ఫోన్ కాల్ చేసి మాట్లాడారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జీసీసీ దేశాలకు పలువురు ప్రమాదంపై దింగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









