ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. దాని ధర ఎంత..?
- June 18, 2025
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షి పాస్ ను అందుబాటులోకి తీసుక్చొచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్ లో పోస్టు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పాస్ విలువ రూ. 3వేలుగా నిర్ణయించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ‘ఎక్స్’ ఖాతాలో ఇలా రాశారు. ‘‘ఒక చారిత్రాత్మక నిర్ణయంలో భాగంగా రూ.3వేలు విలువైన ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు లేదా 200 ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రత్యేక పాస్ నాన్- కమర్షియల్ వాహనాలు (కార్లు, జీపులు, వ్యాన్లు, మొదలైనవి) కోసం మాత్రమే పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి ఈ పాస్ ద్వారా వీలు కల్పించడం జరుగుతుంది’’ అంటూ నితిన్ గడ్కరీ చెప్పారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను యాక్టివేషన్ కోసం త్వరలో ప్రత్యేక లింక్ ను అందుబాటులోకి తెస్తామని గడ్కరీ తెలిపారు. రాజ్మార్గ్ యాత్ర యాప్లో, NHAI, MoRTH అధికారిక వెబ్సైట్లలో ఈ లింక్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దేశంలోని అన్ని జాతీయ రహదారులపై వార్షిక పాస్ పనిచేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







