రష్యన్ ఫేడరేషన్ ప్రాసిక్యూటర్ తో సౌదీ అటార్నీ జనరల్ సమావేశం..!!
- June 20, 2025
సెయింట్ పీటర్స్బర్గ్: అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్-ముజాబ్ సెయింట్ పీటర్స్బర్గ్లో రష్యన్ ఫెడరేషన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇగోర్ విక్టోరోవిచ్ క్రాస్నోవ్తో సమావేశమయ్యారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు దేశాల పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య సహకారం, న్యాయ రంగాలలో నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి, చట్టపరమైన సంస్కృతి, నేరాలను ఎదుర్కోవడంలో.. న్యాయాన్ని సాధించే ప్రయాత్నాలపై సమీక్షించారు.
ఈ పర్యటన సౌదీ అరేబియాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్, రష్యన్ ఫెడరేషన్ మధ్య బలమైన సంబంధాలను విస్తరిస్తుందన్నారు. న్యాయపరమైన విషయాలలో ఉమ్మడి ప్రయోజనాలను అందించడంపై ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు.
2019లో రెండు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం నేపథ్యంలో 2023-2024లో సహకార కార్యక్రమానికి పునాది పడింది. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం, దేశాలు- సంస్థల మధ్య భాగస్వామ్య విలువలను పెంచడానికి ఉన్నత స్థాయి వేదికగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









