రష్యన్ ఫేడరేషన్ ప్రాసిక్యూటర్ తో సౌదీ అటార్నీ జనరల్ సమావేశం..!!
- June 20, 2025
సెయింట్ పీటర్స్బర్గ్: అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్-ముజాబ్ సెయింట్ పీటర్స్బర్గ్లో రష్యన్ ఫెడరేషన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇగోర్ విక్టోరోవిచ్ క్రాస్నోవ్తో సమావేశమయ్యారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు దేశాల పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య సహకారం, న్యాయ రంగాలలో నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి, చట్టపరమైన సంస్కృతి, నేరాలను ఎదుర్కోవడంలో.. న్యాయాన్ని సాధించే ప్రయాత్నాలపై సమీక్షించారు.
ఈ పర్యటన సౌదీ అరేబియాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్, రష్యన్ ఫెడరేషన్ మధ్య బలమైన సంబంధాలను విస్తరిస్తుందన్నారు. న్యాయపరమైన విషయాలలో ఉమ్మడి ప్రయోజనాలను అందించడంపై ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు.
2019లో రెండు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం నేపథ్యంలో 2023-2024లో సహకార కార్యక్రమానికి పునాది పడింది. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం, దేశాలు- సంస్థల మధ్య భాగస్వామ్య విలువలను పెంచడానికి ఉన్నత స్థాయి వేదికగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







