రష్యన్ ఫేడరేషన్ ప్రాసిక్యూటర్ తో సౌదీ అటార్నీ జనరల్ సమావేశం..!!
- June 20, 2025
సెయింట్ పీటర్స్బర్గ్: అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్-ముజాబ్ సెయింట్ పీటర్స్బర్గ్లో రష్యన్ ఫెడరేషన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇగోర్ విక్టోరోవిచ్ క్రాస్నోవ్తో సమావేశమయ్యారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు దేశాల పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య సహకారం, న్యాయ రంగాలలో నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి, చట్టపరమైన సంస్కృతి, నేరాలను ఎదుర్కోవడంలో.. న్యాయాన్ని సాధించే ప్రయాత్నాలపై సమీక్షించారు.
ఈ పర్యటన సౌదీ అరేబియాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్, రష్యన్ ఫెడరేషన్ మధ్య బలమైన సంబంధాలను విస్తరిస్తుందన్నారు. న్యాయపరమైన విషయాలలో ఉమ్మడి ప్రయోజనాలను అందించడంపై ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు.
2019లో రెండు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం నేపథ్యంలో 2023-2024లో సహకార కార్యక్రమానికి పునాది పడింది. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం, దేశాలు- సంస్థల మధ్య భాగస్వామ్య విలువలను పెంచడానికి ఉన్నత స్థాయి వేదికగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









