క్రీడాకారుల కోసం నాణ్యమైన వస్తువులు ...
- July 13, 2016
జీవితంలో క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని అలాంటి క్రికెట్ కోసం ఎంతో కొంత తిరిగిచ్చేయాలనుకుంటున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ మాస్టర్ బ్టాస్టర్ సచిన్ తెలిపాడు. వ్యాపారవేత్తగా మారిన సచిన్ క్రీడా వస్తువులను తయారు చేసే సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ క్రీడాకారుల కోసం నాణ్యమైన వస్తువులను తయారుచేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న 'స్పార్టాన్ ఇంటర్నేషనల్'లో భాగస్వామి కావడంతోపాటు బోర్డులో సలహాదారుడిగా కూడా చేరాడు. హెల్మెట్స్, గ్లోవ్స్, లెగ్ గార్డ్స్ల తయారీలో సచిన్ తన నైపుణ్యాలను సంస్థతో పంచుకోనున్నాడు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ను ఈ విధంగా ప్రారంభించినప్పటికీ.. దీన్ని వ్యాపార కోణంలో చూడాలనుకోవట్లేదని.. భవిష్యత్ క్రికెటర్లకు తనవంతు సాయంగా మెరుగైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నానని సచిన్ పేర్కొన్నాడు.
మైదానంలో ఆటగాళ్ల వ్యక్తిగత భద్రత అతిముఖ్యమైన అంశం. అందుకే రక్షణ కల్పించే వస్తువులపైనే తాము ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు సచిన్ తెలిపాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్న చాలా సందర్భాల్లో తన చేతివేళ్లు విరిగాయని అలాంటివి జరగకుండా గ్లోవ్స్ తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఈ సందర్భంగా పంచుకున్నాడు. మరోవైపు సచిన్ మార్క్ కనబడే కొత్తశ్రేణి ఉత్పత్తులు అక్టోబర్ 1 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







