ఉద్రిక్తతలను తగ్గించడానికి వెంటనే కాల్పుల విరమణను పాటించాలి..ఒమన్
- June 22, 2025
ఇస్తాంబుల్: ఇస్తాంబుల్లో జరిగిన అరబ్ దేశాల లీగ్ కౌన్సిల్ అసాధారణ సమావేశంలో పాల్గొన్న ఒమన్ సుల్తానేట్.. ఇరానియన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి దౌత్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హార్తీ నేతృత్వం వహించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్పై ఇజ్రాయెల్ దురాక్రమణను సమావేశం ఖండించింది. ఇది UN సభ్య దేశ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని, ప్రాంతీయ శాంతి భద్రతకు ముప్పు అని ఆక్షేపించింది. ఈ దురాక్రమణను ఆపాలని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి వెంటనే కాల్పుల విరమణను పాటించాలని సూచించింది. ఉద్రిక్తతలను ఆపేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉందని తెల్చిచెప్పింది.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







