ఉద్రిక్తతలను తగ్గించడానికి వెంటనే కాల్పుల విరమణను పాటించాలి..ఒమన్
- June 22, 2025
ఇస్తాంబుల్: ఇస్తాంబుల్లో జరిగిన అరబ్ దేశాల లీగ్ కౌన్సిల్ అసాధారణ సమావేశంలో పాల్గొన్న ఒమన్ సుల్తానేట్.. ఇరానియన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి దౌత్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హార్తీ నేతృత్వం వహించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్పై ఇజ్రాయెల్ దురాక్రమణను సమావేశం ఖండించింది. ఇది UN సభ్య దేశ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని, ప్రాంతీయ శాంతి భద్రతకు ముప్పు అని ఆక్షేపించింది. ఈ దురాక్రమణను ఆపాలని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి వెంటనే కాల్పుల విరమణను పాటించాలని సూచించింది. ఉద్రిక్తతలను ఆపేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉందని తెల్చిచెప్పింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!