బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- March 05, 2026
మనామాః ఇరాన్ ప్రయోగించిన దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్టు బహ్రెయిన్ రక్షణ దళాలు (BDF) ప్రకటించింది. బహ్రెయిన్ గగనతలం, జలాలు మరియు భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని 74 బాలిస్టిక్ క్షిపణులను మరియు 117 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించిందని తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకొని విజయవంతంగా నాశనం చేశాయని పేర్కొంది. ఈ సందర్భంగా బహ్రెయిన్ గగనతలం సురక్షితంగా ఉందని పౌరులు మరియు నివాసితులకు భరోసా ఇచ్చింది.
పౌరులు మరియు నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని సూచించారు. అధికారులు జారీ చేసిన గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని కోరారు. సైనిక కార్యకలాపాలను ఫోటో, వీడియో తీయకుండా ఉండాలని, పుకార్లను వ్యాప్తి చేయకుండా చేయవద్దని, ప్రభావిత ప్రాంతాలు లేదా అనుమానాస్పద వస్తువులకు దూరంగా ఉండాలని ప్రజలకు అలెర్జ్ జారీచేసింది.
బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి రెసిడెన్షియల్ ప్రాంతాలు మరియు ప్రైవేట్ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ను ఉల్లంఘించడమేనని జనరల్ కమాండ్ తేల్చిచెప్పింది. ఇటువంటి విచక్షణారహిత దాడులు ప్రాంతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









