బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- March 05, 2026
మనామాః ఇరాన్ ప్రయోగించిన దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్టు బహ్రెయిన్ రక్షణ దళాలు (BDF) ప్రకటించింది. బహ్రెయిన్ గగనతలం, జలాలు మరియు భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని 74 బాలిస్టిక్ క్షిపణులను మరియు 117 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించిందని తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకొని విజయవంతంగా నాశనం చేశాయని పేర్కొంది. ఈ సందర్భంగా బహ్రెయిన్ గగనతలం సురక్షితంగా ఉందని పౌరులు మరియు నివాసితులకు భరోసా ఇచ్చింది.
పౌరులు మరియు నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని సూచించారు. అధికారులు జారీ చేసిన గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని కోరారు. సైనిక కార్యకలాపాలను ఫోటో, వీడియో తీయకుండా ఉండాలని, పుకార్లను వ్యాప్తి చేయకుండా చేయవద్దని, ప్రభావిత ప్రాంతాలు లేదా అనుమానాస్పద వస్తువులకు దూరంగా ఉండాలని ప్రజలకు అలెర్జ్ జారీచేసింది.
బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి రెసిడెన్షియల్ ప్రాంతాలు మరియు ప్రైవేట్ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ను ఉల్లంఘించడమేనని జనరల్ కమాండ్ తేల్చిచెప్పింది. ఇటువంటి విచక్షణారహిత దాడులు ప్రాంతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









