బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- March 05, 2026
మనామాః ఇరాన్ ప్రయోగించిన దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్టు బహ్రెయిన్ రక్షణ దళాలు (BDF) ప్రకటించింది. బహ్రెయిన్ గగనతలం, జలాలు మరియు భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని 74 బాలిస్టిక్ క్షిపణులను మరియు 117 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించిందని తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకొని విజయవంతంగా నాశనం చేశాయని పేర్కొంది. ఈ సందర్భంగా బహ్రెయిన్ గగనతలం సురక్షితంగా ఉందని పౌరులు మరియు నివాసితులకు భరోసా ఇచ్చింది.
పౌరులు మరియు నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని సూచించారు. అధికారులు జారీ చేసిన గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని కోరారు. సైనిక కార్యకలాపాలను ఫోటో, వీడియో తీయకుండా ఉండాలని, పుకార్లను వ్యాప్తి చేయకుండా చేయవద్దని, ప్రభావిత ప్రాంతాలు లేదా అనుమానాస్పద వస్తువులకు దూరంగా ఉండాలని ప్రజలకు అలెర్జ్ జారీచేసింది.
బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి రెసిడెన్షియల్ ప్రాంతాలు మరియు ప్రైవేట్ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ను ఉల్లంఘించడమేనని జనరల్ కమాండ్ తేల్చిచెప్పింది. ఇటువంటి విచక్షణారహిత దాడులు ప్రాంతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..







