తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- March 05, 2026
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం పార్టీ అధిష్టానం ఇద్దరు నేతల పేర్లను ఖరారు చేసింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ రాజకీయ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి మరియు ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విలకు రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం కల్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వానికి రాజకీయ సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీలో చేసిన సేవలు, నాయకత్వానికి ఉన్న సమీప సంబంధాల కారణంగా ఈసారి ఆయనకు రాజ్యసభ అవకాశం దక్కినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా న్యాయరంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గతంలో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు విజయం దక్కకపోవడంతో, ఈసారి తెలంగాణ నుంచి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ రేసులో మొదటి నుంచి ఉన్న సీనియర్ నేతలు వి హనుమంతరావు మరియు జీవన్ రెడ్డిలకు ఈసారి కూడా అవకాశం దక్కలేదు.పార్టీ తమకు అవకాశం ఇస్తుందని ఆశించిన ఈ నేతలు అధిష్టానం నిర్ణయంతో నిరాశకు గురైనట్లు సమాచారం.
ఎంపికైన అభ్యర్థులు రేపు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









