కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- June 24, 2025
రియాద్: GCC ప్రధాన కార్యదర్శి జాసెమ్ మొహమ్మద్ అల్ బుదైవి, ఇరాన్ కతార్ భూభాగంపై జరిపిన మిసైల్ దాడిని తీవ్ర పదజాలంతో ఖండించారు.ఈ దాడి కతార్ సార్వభౌమాధికారానికి స్పష్టమైన ఉల్లంఘనగా, అన్ని GCC సభ్య దేశాల భద్రతకు ప్రత్యక్షమైన ముప్పుగా అభివర్ణించారు.
GCC దేశాల భద్రత భేదించలేని సమైక్యతగా ఉంటుందని, కతార్ భద్రత మరియు భూభాగ సమగ్రతను కాపాడడంలో మండలి పూర్తిగా కతార్కు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అల్బుదైవి అన్నారు: “ఇస్రాయేల్ ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండిస్తూ, కాల్పులు నిలిపే ఒప్పందం సాధించేందుకు కతార్ మరియు ఇతర GCC దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్న ఈ సమయంలో, ఇరాన్ ఈ విధంగా మిసైల్ దాడికి పాల్పడటం అంతర్జాతీయ నిబంధనలు, ఒప్పందాలు మరియు చట్టాలకు పూర్తిగా విరుద్ధమైంది.”
ఈ దాడిని ఖండించాల్సిన బాధ్యతను అంతర్జాతీయ సమాజం మరియు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పట్ల వహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇరాన్ యొక్క బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాంతీయ స్థిరతను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని రీత్యా వివాద పరిష్కారం కోసం సంభాషణ, రాజనీతిని ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









