కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- June 24, 2025
రియాద్: GCC ప్రధాన కార్యదర్శి జాసెమ్ మొహమ్మద్ అల్ బుదైవి, ఇరాన్ కతార్ భూభాగంపై జరిపిన మిసైల్ దాడిని తీవ్ర పదజాలంతో ఖండించారు.ఈ దాడి కతార్ సార్వభౌమాధికారానికి స్పష్టమైన ఉల్లంఘనగా, అన్ని GCC సభ్య దేశాల భద్రతకు ప్రత్యక్షమైన ముప్పుగా అభివర్ణించారు.
GCC దేశాల భద్రత భేదించలేని సమైక్యతగా ఉంటుందని, కతార్ భద్రత మరియు భూభాగ సమగ్రతను కాపాడడంలో మండలి పూర్తిగా కతార్కు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అల్బుదైవి అన్నారు: “ఇస్రాయేల్ ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండిస్తూ, కాల్పులు నిలిపే ఒప్పందం సాధించేందుకు కతార్ మరియు ఇతర GCC దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్న ఈ సమయంలో, ఇరాన్ ఈ విధంగా మిసైల్ దాడికి పాల్పడటం అంతర్జాతీయ నిబంధనలు, ఒప్పందాలు మరియు చట్టాలకు పూర్తిగా విరుద్ధమైంది.”
ఈ దాడిని ఖండించాల్సిన బాధ్యతను అంతర్జాతీయ సమాజం మరియు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పట్ల వహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇరాన్ యొక్క బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాంతీయ స్థిరతను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని రీత్యా వివాద పరిష్కారం కోసం సంభాషణ, రాజనీతిని ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







