కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- June 24, 2025
రియాద్: GCC ప్రధాన కార్యదర్శి జాసెమ్ మొహమ్మద్ అల్ బుదైవి, ఇరాన్ కతార్ భూభాగంపై జరిపిన మిసైల్ దాడిని తీవ్ర పదజాలంతో ఖండించారు.ఈ దాడి కతార్ సార్వభౌమాధికారానికి స్పష్టమైన ఉల్లంఘనగా, అన్ని GCC సభ్య దేశాల భద్రతకు ప్రత్యక్షమైన ముప్పుగా అభివర్ణించారు.
GCC దేశాల భద్రత భేదించలేని సమైక్యతగా ఉంటుందని, కతార్ భద్రత మరియు భూభాగ సమగ్రతను కాపాడడంలో మండలి పూర్తిగా కతార్కు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అల్బుదైవి అన్నారు: “ఇస్రాయేల్ ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండిస్తూ, కాల్పులు నిలిపే ఒప్పందం సాధించేందుకు కతార్ మరియు ఇతర GCC దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్న ఈ సమయంలో, ఇరాన్ ఈ విధంగా మిసైల్ దాడికి పాల్పడటం అంతర్జాతీయ నిబంధనలు, ఒప్పందాలు మరియు చట్టాలకు పూర్తిగా విరుద్ధమైంది.”
ఈ దాడిని ఖండించాల్సిన బాధ్యతను అంతర్జాతీయ సమాజం మరియు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పట్ల వహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇరాన్ యొక్క బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాంతీయ స్థిరతను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని రీత్యా వివాద పరిష్కారం కోసం సంభాషణ, రాజనీతిని ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







