కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- June 24, 2025
రియాద్: GCC ప్రధాన కార్యదర్శి జాసెమ్ మొహమ్మద్ అల్ బుదైవి, ఇరాన్ కతార్ భూభాగంపై జరిపిన మిసైల్ దాడిని తీవ్ర పదజాలంతో ఖండించారు.ఈ దాడి కతార్ సార్వభౌమాధికారానికి స్పష్టమైన ఉల్లంఘనగా, అన్ని GCC సభ్య దేశాల భద్రతకు ప్రత్యక్షమైన ముప్పుగా అభివర్ణించారు.
GCC దేశాల భద్రత భేదించలేని సమైక్యతగా ఉంటుందని, కతార్ భద్రత మరియు భూభాగ సమగ్రతను కాపాడడంలో మండలి పూర్తిగా కతార్కు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అల్బుదైవి అన్నారు: “ఇస్రాయేల్ ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండిస్తూ, కాల్పులు నిలిపే ఒప్పందం సాధించేందుకు కతార్ మరియు ఇతర GCC దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్న ఈ సమయంలో, ఇరాన్ ఈ విధంగా మిసైల్ దాడికి పాల్పడటం అంతర్జాతీయ నిబంధనలు, ఒప్పందాలు మరియు చట్టాలకు పూర్తిగా విరుద్ధమైంది.”
ఈ దాడిని ఖండించాల్సిన బాధ్యతను అంతర్జాతీయ సమాజం మరియు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పట్ల వహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇరాన్ యొక్క బాధ్యతారాహిత్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాంతీయ స్థిరతను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని రీత్యా వివాద పరిష్కారం కోసం సంభాషణ, రాజనీతిని ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'