65 మందితో వెళ్తున్న పడవ మునక..43 మంది గల్లంతు
- July 03, 2025
ఇండోనేషియాలోని బాలి ద్వీపం సమీపంలో ఒక ఫెర్రీ మునిగిపోవడంతో సముద్రంలో తప్పిపోయిన 38 మంది కోసం రెస్క్యూ టీమ్ వెతుకుతున్నారు. మరో నలుగురు మరణించగా, 23 మందిని రక్షించినట్లు సురబయ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది. బుధవారం రాత్రి తూర్పు జావాలోని కేతాపాంగ్ ఓడరేవు నుండి బయలుదేరిన దాదాపు అరగంట తర్వాత KMP తును ప్రతమా జయ మునిగిపోయిందని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది బాలిలోని గిలిమనుక్ ఓడరేవుకు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 14 ట్రక్కులు సహా 22 వాహనాలు ఉన్నాయని తెలిపింది. రాత్రిపూట చీకటిలో 2 మీటర్లు (6.5 అడుగులు) ఎత్తుకు ఎగసిన అలలతో పోరాడుతూ, రెండు టగ్ బోట్లు సహా తొమ్మిది పడవలు తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతుకుతున్నాయి. 17,000 కంటే ఎక్కువ దీవులతో కూడిన ద్వీపసమూహం అయిన ఇండోనేషియాలో ఫెర్రీ విషాదాలు సర్వసాధారణం.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







