జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- March 13, 2026
దోహా: ప్రజల భద్రతను కాపాడటానికి, అదనపు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలుగా జాతీయ హెచ్చరిక వ్యవస్థ (National Warning System) అలర్ట్ లు యాక్టివేట్ చేసినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అందించే సూచనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. భవనాల లోపల ఉన్న సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లడం, కిటికీలకు మరియు ఇతర బహిర్గత ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే భద్రతా ముప్పు తొలగిపోయిందని అధికారిక అలర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యేంత వరకు బయటకు రావద్దని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







