విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఏపీ వారికి హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు..
- July 10, 2025
అమరావతి: జీవనోపాధి కోసం కొందరు పుట్టిన ఊరుని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. అక్కడైతే మంచి ఉద్యోగాలు దొరుకుతాయని, జీతం ఎక్కువగా వస్తుందని, తమ కష్టాలు తీరతాయని అనుకుంటారు. కానీ, అక్కడికి వెళ్లాకే తెలుస్తోంది అసలు విషయం. వారు పడే ఇబ్బందులు, అవస్థలు అన్నీఇన్నీ కావు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు ఎందరో. అక్కడ ఉండలేరు, స్వదేశానికి తిరిగి రాలేరు. వారు పడే బాధ అంతా ఇంతా కాదు. తమను ఆదుకోవాలని అధికారులను వేడుకునే వారు ఎందరో.ఈ క్రమంలో విదేశాల్లో ఇబ్బందుల్లో ఉండే తెలుగువారికి అండగా నిలిచారు మంత్రి నారా లోకేశ్. అలాంటి వ్యక్తుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.
థాయిలాండ్లో కొందరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకులు మోసపోయారని తనకు తెలిసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిసిందన్నారు.అలా మోసపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఇక, ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.. +91-863-2340678.. వాట్సాప్ నెంబర్ 85000 27678. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారు ఈ నెంబర్లను సంప్రదించాలని మంత్రి లోకేశ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







