విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఏపీ వారికి హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు..
- July 10, 2025
అమరావతి: జీవనోపాధి కోసం కొందరు పుట్టిన ఊరుని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. అక్కడైతే మంచి ఉద్యోగాలు దొరుకుతాయని, జీతం ఎక్కువగా వస్తుందని, తమ కష్టాలు తీరతాయని అనుకుంటారు. కానీ, అక్కడికి వెళ్లాకే తెలుస్తోంది అసలు విషయం. వారు పడే ఇబ్బందులు, అవస్థలు అన్నీఇన్నీ కావు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు ఎందరో. అక్కడ ఉండలేరు, స్వదేశానికి తిరిగి రాలేరు. వారు పడే బాధ అంతా ఇంతా కాదు. తమను ఆదుకోవాలని అధికారులను వేడుకునే వారు ఎందరో.ఈ క్రమంలో విదేశాల్లో ఇబ్బందుల్లో ఉండే తెలుగువారికి అండగా నిలిచారు మంత్రి నారా లోకేశ్. అలాంటి వ్యక్తుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.
థాయిలాండ్లో కొందరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకులు మోసపోయారని తనకు తెలిసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిసిందన్నారు.అలా మోసపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఇక, ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.. +91-863-2340678.. వాట్సాప్ నెంబర్ 85000 27678. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారు ఈ నెంబర్లను సంప్రదించాలని మంత్రి లోకేశ్ చెప్పారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







