యూఎస్ వెళ్లాలనుకునే వారికి ట్రంప్ బిగ్ షాక్
- July 10, 2025
అమెరికా: ఉద్యోగ (హెచ్-1బీ)(H-1), విద్యార్థి (ఎఫ్/ఎం), పర్యాటక/వ్యాపార (బీ-1, బీ2),ఎక్స్చేంజ్ (జే)…ఏదైనా వీసా అయినా సరే…అమెరికా వెళ్ళాలనుకుంటే ఇక మీదట ఎక్కువ ఫీజులు చెల్లించాల్సిందే.వచ్చే ఏడాది నుంచి ఇంటెగ్రిటీ ఫీజు కింద అదనంగా 250 డాలర్లు చెల్లించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాకు వచ్చేవారు అక్రమంగా ఉండిపోకుండా, వీసా కాలానికి మించి ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా అమలు చేసిన వన్ బిగ్ బ్యూటిపుల్ చట్టం కింద ఈ వీసా ఫీజులు కూడా అమలు కానున్నాయి. అంతే కాదు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ ఫీజుల్లో మార్పులు చోటు కూడా చేసుకుంటాయి.
తడిసిమోపెడవనున్న వీసా ఛార్జీలు..
వీసా జారీ చేసేటప్పుడే ఈ అధిక రుసుమును అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ రుసుమును సర్చార్జ్ రూపంలో వసూలు చేస్తుంది. దీంతోపాటు.. ఐ-94 సర్చార్జ్ 24 డాలర్లు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ ఈఎస్ టీఏ- 13 డాలర్లు, ఎలక్ట్రానిక్ వీసా అప్డేట్ సిస్టమ్ ఈవీయూఎస్-30 డాలర్లు కింద అదనపు రుసుములను వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో పొందుపరిచారు. ఇవన్నీ కలిపి ప్రస్తుతం వీసా ఫీజులు భారంగా మారనున్నాయి. ఇప్పటి వరకు అమెరికాకు పర్యాటక/వ్యాపార వీసాపై వెళ్లాలంటే వీసా చార్జీలుగా 185 డాలర్లు వసూలు చేస్తున్నారు. అంటే దాదాపుగా రూ.15,855. బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్లో ప్రతిపాదించిన ఇతర చార్జీలను, ఇంటెగ్రిటీ రుసుమును కూడా కలుపుకొంటే ఇప్పుడు అది ఏకంగా 472 డాలర్లకు అంటే రూ.40,456 గా అవనుంది.
US వీసాతో ఎన్ని దేశాలను సందర్శించవచ్చు?
- US వీసా, ప్రత్యేకంగా బహుళ-ప్రవేశ B1/B2 వీసా, భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు ప్రత్యేక వీసా అవసరం లేకుండా అనేక ఇతర దేశాలలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. ఈ దేశాలలో కరేబియన్, మధ్య మరియు దక్షిణ అమెరికా మరియు తూర్పు ఐరోపాలోని దేశాలు ఉన్నాయి.
- B1 మరియు B2 వీసాలు అంటే ఏమిటి?
- B1 మరియు B2 వీసాల మధ్య తేడా ఏమిటి?
- B1 మరియు B2 వీసాలు తాత్కాలిక బసల కోసం యునైటెడ్ స్టేట్స్ జారీ చేసిన వలసేతర వీసాలు. B1 వీసా వ్యాపార ప్రయోజనాల కోసం, అయితే B2 వీసా పర్యాటకం, వినోదం లేదా వైద్య చికిత్స కోసం. అవి తరచుగా కలిపి B1/B2 వీసాగా జారీ చేయబడతాయి, ఇది వ్యాపారం మరియు విశ్రాంతి ప్రయాణాలకు అనుమతిస్తుంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







